హ్యాట్రిక్​ హిట్​ కాంబో రిపీట్​.. బాలయ్య ఫ్యాన్స్​కి పండగే!

సినిమాల్లో హీరో హీరోయిన్​ కాంబినేషన్​ ఎంత ప్రత్యేకమో, డైరెక్టర్​‌‌ హీరో కాంబినేషన్​ కూడా అంతే స్పెషల్​. అందుకే హిట్​ కాంబోలు మళ్లీ మళ్లీ రిపీట్​ అవుతూ ఉంటాయి. ఇక, టాలీవుడ్​లో నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేషన్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి కాంబోకి ఇటు ఫ్యాన్స్‌, అటు ఆడియెన్స్‌లో ఉండే క్రేజ్​ అంతా ఇంతా కాదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన మూడు సినిమాలు బ్లాక్​బస్టర్​ హిట్​లుగా నిలిచి బాక్సాఫీస్​ను షేక్​ చేశాయి. అంతేకాదు, బాలయ్యలోని మాస్​ని ప్రేక్షకులు మెచ్చేలా చూపించే ఏకైక డైరెక్టర్​గా పేరు సంపాదించుకున్నారు బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్​, అఖండ రికార్డులను తిరగరాశాయి. కాగా, తాజాగా వీరిద్దరూ క‌లిసి నాలుగో సినిమా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు గట్టిగా వినిపిస్తున్నాయి.

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో నిర్మాత‌లు రామ్ ఆచంట‌, గోపి ఆచంట క‌లిసి 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై BB4ను నిర్మించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌ను కలిసి బోయ‌పాటి శ్రీను కథను కూడా చెప్పారనీ, అది బాలయ్యకు బాగా నచ్చడంతో ఓకే చెప్పారనీ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బోయపాటి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట. నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్ 10న ఈ సినిమాను లాంచ‌నంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. 2024 ప్ర‌థ‌మార్థంలోనే ఈ సినిమా వ‌చ్చేలా ప్లాన్ చేసుకుని అందుకు త‌గ్గట్టే ముందుకెళ‌తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ NBK 108 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బాలయ్య లుక్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి బోయపాటితో చేయబోయే నెక్ట్స్ మూవీపై ఫోక‌స్ పెడ‌తారని టాలీవుడ్​ టాక్​. ఇక ఈ సినిమాలో బాలయ్య అభిమానులకు న‌చ్చే అంశాలతోపాటు ఏపీ పాలిటిక్స్‌ను బేస్ చేసుకుని కూడా కొన్ని అంశాల‌ను BB4లో ట‌చ్ చేస్తార‌ని స‌మాచారం. హ్యాట్రిక్​ హిట్​ కొట్టిన ఈ కాంబో ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించనుందో తెలయాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే!