మెగా ప్రిన్స్​​ సరసన మాజీ మిస్​ యూనివర్స్​!

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ తదుపరి చిత్రంలో మాజీ మిస్​ యూనివర్స్​ మానుషీ చిల్లర్​ నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్​ డైరెక్టర్ ప్రవీణ్​ సత్తారు దర్శకత్వంలో ‘గాండివధారి అర్జున’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా, వరుణ్ ఈ సినిమాతోపాటు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వంలో ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందనున్న సినిమాలోనూ నటించనున్నాడు. ఇది వరుణ్ కు 13వ సినిమా. ఇందులో వరుణ్ పైలట్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో వరుణ్ కు జోడీ మాజీ మిస్ యూనివర్స్‌ మానుషీ చిల్లర్‌ నటించనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ తెలియజేస్తూ.. ఆమెకు సంబందించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో మానుషీ చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని నిర్మిస్తున్నారు. కాగా.. తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మానుషీ చిల్లర్​ ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మానుషీ చిల్లర్ 2017లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. అయినప్పటికి, ఆమె నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫలితంగా మానుషి వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ‘విటి13’ రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఒకేసారి తెలుగు, హిందీలో మూవీని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడాదర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనెసాన్స్ పిక్చర్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ కలసి నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి నాగబాబు సమర్పిస్తున్నారు. మరోవైపు జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఓ మూవీలో మానుషి చిల్లర్ నటిస్తున్నారు. వరుణ్​, మానుషీ జంట ముచ్చటగా ఉంటుందని సోషల్​ మీడియాలో చర్చ మొదలైంది. ఈ అందమైన జంటను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.