Nayanthara: జై శ్రీరాం.. క్ష‌మించండి

Nayanthara: న‌టి న‌య‌న‌తార ఎట్ట‌కేల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆమె న‌టించిన అన్న‌పూరాణి (annapoorani) సినిమాలో రాముడు కూడా చికెన్ తింటాడు అనే డైలాగ్ వాడ‌టంతో విశ్వ హిందూ ప‌రిష‌త్ సంఘం పెద్ద ర‌చ్చ చేసింది. సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొల‌గించేలా చ‌ర్య‌లు తీసుకుంది. దాంతో రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే సినిమాను నెట్‌ఫ్లిక్స్ తొల‌గించింది. క్ష‌మాప‌ణ‌లు చెప్పేవ‌ర‌కు సినిమాను ఆడ‌నివ్వ‌మ‌ని విశ్వ హిందూ ప‌రిష‌త్ బెదిరింపుల‌కు పాల్ప‌డటంతో మొత్తానికి న‌య‌న‌తార జై శ్రీరాం.. క్ష‌మించండి అంటూ ఒక లెట‌ర్‌ను రిలీజ్ చేసారు. తాము ఎవ్వరినీ కించ‌ప‌ర‌చాల‌ని అలాంటి డైలాగులు పెట్ట‌లేద‌ని అంద‌రికీ వినోదాన్ని అందించేందుకే సినిమా తీసామ‌ని నయ‌న‌తార పేర్కొన్నారు. తెలిసో తెలికో ఎవ‌రి మ‌నోభావాలైనా దెబ్బ‌తిని ఉంటే క్ష‌మించాల‌ని అన్నారు.

జ‌రిగింది ఇది

న‌య‌న్ ప్రధాన పాత్ర‌లో న‌టించిన అన్న‌పూరాణి సినిమాలో ఒక వివాదాస్ప‌ద డైలాగ్ ఉంది. రాముడు కూడా చికెన్ తింటాడు అనే డైలాగ్‌ను అవ‌లీల‌గా వాడేసారు. అస‌లే అయోధ్య రామ‌మందిరంలో ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇలాంటి డైలాగ్ ర‌చ్చ లేపింది. దానిని తొల‌గించేవ‌ర‌కు ఊరుకునేది లేద‌ని రామ భ‌క్తులు, విశ్వ హిందూ ప‌రిష‌త్ వారు ఆందోళ‌న చేప‌ట్టారు. వారి తాకిడి త‌ట్టుకోలేక ఆ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొల‌గించాల్సి వ‌చ్చింది.