ఒక‌టి వ‌ద్దు.. రెండు ముద్దు..!

directors are only focusing on 2 part films in tollywood

Tollywood: ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో సినిమాలు ఎలా ఉండేవంటే.. ఒక మంచి స్టోరీతో వ‌చ్చి మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టేవి. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయితే ద‌ర్శ‌కుడు సీక్వెల్ తీయాల‌ని స‌న్నాహాలు చేసేవారు. మ‌రికొంద‌రేమో.. మంచి సినిమాకు సీక్వెల్ తీస్తే ఎక్క‌డ అన‌వ‌స‌రంగా మొద‌టి సినిమా క‌లిగించిన ఇంపాక్ట్ పోతుందో అని ట‌చ్ చేయ‌కుండా ఉండేవారు.

అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ప‌రిస్థితి వేరేలా ఉంది. అగ్ర హీరోలైన జూనియ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌భాస్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌ల ద‌గ్గ‌రికి చాలా క‌థ‌లు వ‌స్తున్నాయి. కానీ వారంతా రెండు భాగాలుగా తీయాల్సిన క‌థ‌లే చెప్తున్నార‌ట‌. దాంతో అగ్ర హీరోలు క‌థ బాగున్న‌ప్ప‌టికీ రెండు భాగాలంటే ఆల‌స్యం అవుతుంది అని ఆలోచిస్తూ ఓకే చెప్ప‌లేక‌పోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రెండు భాగాల ట్రెండే న‌డుస్తోంద‌ని.. ఇంకొన్ని రోజులు పోతే ఒక్క పార్ట్‌తో సినిమాలు వ‌చ్చే ఆస్కారం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని సినీ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.