Ram Charan తన కాల్​ ఆన్సర్​ చేయడంటున్న డైరెక్టర్!

Mumbai: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పదేళ్ల కిందటే బాలీవుడ్​(Bollywood) ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్​ డైరెక్టర్​ అపూర్వ లఖియా(Director Apoorva Lakhia) దర్శకత్వంలో జంజీర్(Zanjeer)​ అనే సినిమా ద్వారా 2013 లోనే నార్త్​ ప్రేక్షకులను పలకరించాడు చెర్రీ. తెలుగులో తుపాన్​(Toofan) టైటిల్​తో రిలీజైన ఈ సినిమాలో చెర్రీకి జోడీగా బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా(Priyanka chopra) నటించింది. కాగా, చరణ్​ పోలీస్​గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు, ఈ సినిమాలో చెర్రీ నటనపై నార్త్​ మీడియా చాలా దారుణంగా విమర్శలు చేసింది.

అయితే ఆర్​ఆర్​ఆర్​తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని గ్లోబల్​ స్టార్​గా మారిపోయారు రామ్​ చరణ్​. అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు చెర్రీని తెగ పొగిడేస్తున్నారు. బాలీవుడ్​లో చెర్రీతో సినిమాలు తీసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. హాలీవుడ్ నుంచి కూడా చరణ్​కి అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా తుపాకీ దర్శకుడు అపూర్వ లఖియా చెర్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రామ్​ చరణ్​ నాకు మంచి స్నేహితుడు. జంజీర్ బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోకపోయినా తను నాకు మంచి స్నేహితుడిగానే ఉన్నాడు. చాలాసార్లు హైదరాబాద్ లోని తన ఇంటికి వెళ్లి చాలాసార్లు అతనితో కలిసి ఉన్నాను. కానీ కొంతకాలంగా చరణ్​ నా కాల్​ ఆన్సర్​ చేయడం లేదు. బహుశా తన ఫోన్​ మారిపోయి ఉంటుంది. అతని భార్య ఉపాసన మాత్రం రెస్పాండ్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు లిఖియా.