Guntur Kaaram: ఇది వ్యాపారం.. గొడ‌వ‌లు స‌హ‌జం

Guntur Kaaram: సినిమాలంటే వ్యాపారం అని వాటి రిలీజ్ స‌మ‌యంలో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మేన‌ని అన్నారు నిర్మాత దిల్ రాజు (dil raju). సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టించిన గుంటూరు కారం సినిమా నిన్న రిలీజ్ అయిన సంద‌ర్భంగా ఈరోజు క‌లెక్ష‌న్ల గురించి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రిలీజ్ అయిన అన్ని సెంట‌ర్ల‌లో తాము అనుకున్న‌దానికంటే ఎక్కువే క‌లెక్ష‌న్లు వ‌చ్చినందుకు సంతోషంగా ఉంద‌ని అన్నారు. సినిమా బాగుంటే అంద‌రూ ఆద‌రిస్తార‌ని.. దానిని ఏ నెగిటివ్ రివ్యూలు కూడా మార్చ‌లేవ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎవ్వ‌రికి ఎవ‌రూ శ‌త్రువులు, మిత్రులు కార‌ని.. ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బును ఎలా వెన‌క్కి తెచ్చుకోవాల‌నే ప్ర‌తి నిర్మాత చూస్తాడ‌ని తెలిపారు.