Rangabali: మన ఊరిలో మనల్ని ఎవడ్రా అపేది!

Hyderabad:  టాలీవుడ్​ యంగ్​ హీరో నాగశౌర్య(Naga Shaurya) హీరోగా తెరకెక్కుతున్న సినిమా రంగబలి(Rangabali). నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా(yukti thareja) శౌర్యకు జోడీగా నటిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్లో రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన నాగశౌర్య రంగబలితో హిట్​ కొట్టాలని చూస్తున్నారు.

రంగబలి సినిమా నుంచి ‘మన ఊరిలో మనల్ని ఎవడ్రా అపేది’ అనే టైటిల్ తో ఫస్ట్ సింగిల్ మే 24, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఈ చిత్రం జూలై 7న థియేటర్లలోకి రానుంది. చాలాకాలంగా సరైన హిట్​లేని నాగశౌర్య ఈ సినిమాతో అయినా మెప్పిస్తాడో చూడాలి మరి!