Yatra 2 కి పోటీగా..!

Yatra 2: మ‌హి వి రాఘ‌వ్ (mahi v raghav) డైరెక్ట్ చేసిన యాత్ర 2 రిలీజ్ టైంకి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌టించిన కెమెరామ్యాన్ గంగ‌తో రాంబాబు (cameraman ganga tho rambabu) సినిమాను రీరిలీజ్ చేయ‌నున్నారు. యాత్ర 2 సినిమా ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ కానుంది. ఫిబ్ర‌వ‌రి 7న గంగ‌తో రాంబాబు రీరిలీజ్ కానుంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో యాత్ర 2 సినిమాను తీసారు రాఘ‌వ్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో సినిమాల‌తో గెలిచేద్దామ‌ని జ‌గ‌న్ అనుకుంటున్నార‌ని.. ఆయ‌న‌కు ఓటు ప‌డ‌కుండా ఉండాలంటే ప‌వ‌న్ యాక్ట్ చేసిన గంగ‌తో రాంబాబు సినిమానే క‌రెక్ట్ అని జ‌న‌సేన నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.