Boney Kapoor: నాకు లై డిటెక్ట‌ర్ టెస్ట్ చేసి విచారించారు

అల‌నాటి న‌టి శ్రీదేవి (sridevi) చ‌నిపోయిన‌ప్పుడు పోలీసులు త‌న‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారని అన్నారు నిర్మాత బోనీ క‌పూర్ (boney kapoor). 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో శ్రీదేవి బాత్‌ట‌బ్‌లో ప‌డి క‌న్నుమూసారు. ఇది సాధార‌ణ మ‌ర‌ణం కాదు ప్ర‌మాద‌వశాత్తు సంభ‌వించిన మ‌ర‌ణం అని బోనీ క‌పూర్ అన్నారు. శ్రీదేవి చ‌నిపోయాక పోలీసులు త‌న‌ను అదుపులోకి తీసుకుని లై డిటెక్ట‌ర్ టెస్ట్ నిర్వ‌హించి మ‌రీ విచారించార‌ని మొద‌టి సారి ఈ విష‌యాలు బ‌య‌పెట్టారు. శ్రీదేవి చ‌నిపోయిన‌ప్పుడు ఇండియ‌న్ మీడియా ఇందులో ఏదో కుట్ర ఉందంటూ ప్ర‌చారం చేయ‌డం వ‌ల్లే దుబాయ్ పోలీసులు త‌న‌ను దాదాపు 40 గంట‌ల పాటు విచారించార‌ని బోనీ తెలిపారు.