Mokshagna ఎంట్రీపై బెల్లంకొండ గ‌ణేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hyderabad: నంద‌మూరి బాల‌కృష్ణ (balakrishna) కుమారుడు మోక్షజ్ఞ (mokshagna) టాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు న‌టుడు బెల్లంకొండ గ‌ణేష్‌ (bellamkonda ganesh). బెల్లంకొండ శ్రీనివాస్ త‌మ్ముడైన గ‌ణేష్ నేను స్టూడెంట్ స‌ర్ అనే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెప్పాడు. “నంద‌మూరి మోక్షజ్ఞ ఇప్పుడు ఫుల్ ప్రిప‌రేష‌న్‌లో ఉన్నాడు. 2024లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మోక్షజ్ఞ చాలా ఈజ్‌తో డ్యాన్స్ చేస్తాడు. అత‌ను డైలాగ్ చెప్పేట‌ప్పుడు అత‌ని క‌నుబొమ్మ‌లు డైలాగ్ చెప్తున్న‌ట్లు ఉంటుంది” అన్నాడు.

ఇక గ‌ణేష్ న‌టించిన మొద‌టి సినిమా స్వాతిముత్యం హిట్ అవ్వ‌క‌పోవ‌డం గురించి మాట్లాడుతూ.. హిట్, ఫ్లాప్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ఫ్యామిలీ ఆడియ‌న్స్ త‌న‌ను గుర్తుప‌ట్టి సెల్ఫీలు అడుగుతున్నార‌ని తెలిపాడు. ఇక త‌న అన్న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఛ‌త్ర‌ప‌తి రీమేక్ సినిమా గురించి మాట్లాడుతూ.. “సినిమా ఫ్లాప్ అవ‌డంతో అన్న చాలా బాధ‌ప‌డ్డాడు. రెండేళ్ల నుంచి ఈ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. కానీ అనుకున్న రిజ‌ల్ట్ రాలేదు. ఇప్పుడు మ‌రో సినిమా కోసం కష్ట‌ప‌డుతున్నాడు” అని వెల్ల‌డించాడు.