Bandla Ganesh: మాడి మసైపోతావ్​.. బండ్ల మాస్​ వార్నింగ్​!

Hyderabad: సినిమాల్లో కాస్త సైలెంట్​ అయినా సోషల్​ మీడియాలో చురుగ్గా ఉన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh)​. ఈ మధ్యన బండ్ల గణేష్​ ‘గురూజీ..’ అంటూ వరుస ట్వీట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఇదంతా త్రివిక్రమ్(Trivikram)​ గురించే అంటూ వార్తలు హల్​ చల్​ చేస్తున్నాయి. పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​, బండ్ల గణేష్​ మధ్య త్రివిక్రమ్​ చేరి వారి స్నేహాన్ని చెదరగొట్టాడని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ట్విట్టర్​ వేదికగా ఫైర్​ అయ్యారు బండ్ల గణేష్​.

‘అరే వెంకట్ రెడ్డి నువ్వు పెద్ద బ్రోకర్, ఇక్కడ మీ మూర్తి గాడు చిన్న బ్రోకర్. నీలి వార్తలు రాసుకొని, నీలి బతుకులు బతుకుతూ.. దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫుట్. మేము ప్రేమిస్తాం, పూజిస్తాం, ప్రాణం ఇస్తాం, కోపం వస్తే అలుగుతాం. ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫుట్. సినిమా వాళ్ళ వార్తలు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు లేకపోతే నీకు పప్పం గడవదురా వెంకీగా. నువ్వు మనిషివైతే నీకు సిగ్గు, శరం ఉంటే నువ్వు తినేది అన్నమే అయితే ఒక్కసారి ప్రత్యక్షంగా నాకు కనపడు.. నీలీ వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాలు గురించి చూసుకోరా బఫున్ కొడకా.. నిజాయితీగలడితో దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీతిగా బతికేవాడి జోలికి రాకు మాడి మసై పోతావ్’ అంటూ తనపై తప్పుడు రాతలు రాస్తున్న వాళ్లకి నేరుగానే వార్నింగ్​ ఇచ్చారు. దీంతో బండ్ల చేసిన ట్వీట్​ వైరల్​గా మారింది.