Ashish Vidyarthi న‌న్ను మోసం చేయ‌లేదు

Hyderabad: ఆశిష్ విద్యార్ధి (ashish vidyarthi) త‌న‌ని మోసం చేసి రెండో పెళ్లి చేసుకోలేద‌ని క్లారిటీ ఇచ్చారు ఆయ‌న మొద‌టి భార్య ర‌జోషీ బారువా (rajoshi barua). 60 ఏళ్ల ఆశిష్‌.. అస్సాంకు చెందిన ఫ్యాష‌న్ ఎంట్ర‌ప్రెన్యూర్ రుపాలి బారువాను నిన్న వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఈ టాపిక్ కాస్తా వైర‌ల్‌గా మారింది. ఆశిష్ రెండో పెళ్లిపై ర‌జోషీ పెట్టిన పోస్ట్ కూడా వైర‌ల్‌గా మారింది. మ‌న జీవితంలోకి స‌రైన వ్య‌క్తి వ‌చ్చినప్పుడు వాళ్ల‌పై మ‌న‌కున్న ప్రేమ‌ను ప్రశ్నించ‌రు. ఏది మ‌న‌ల్ని బాధిస్తుందో అది చెయ్య‌రు. అది గుర్తుపెట్టుకోండి అని పోస్ట్ చేసారు. దాంతో ఆశిష్ రజోషీని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు.

“ఆశిష్ న‌న్ను మోసం చేయ‌లేదు. ఆశిష్ కేవ‌లం రెండో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు అని అనుకుంటున్న‌వారికి ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. అది నిజం కాదు. 2022లోనే మేం విడాకుల‌కు అప్లై చేసుకున్నాం. ఎవ‌రూ మ‌మ్మ‌ల్ని బ‌ల‌వంతం చేయ‌లేదు. ఇద్ద‌రం ప‌ర‌స్ప‌రంగానే చ‌ర్చించుకుని విడిపోవాల‌నుకున్నాం. ఇన్నేళ్లు అల‌నాటి న‌టి శకుంత‌ల కూతురిగా ఆశిష్ విద్యార్ధి భార్య‌గా జీవితాన్ని గ‌డిపాను. ఇప్పుడు ఒంట‌రిగా నా జీవితాన్ని నేను అనుభ‌వించాల‌నుకుంటున్నాను. నాకంటూ గుర్తింపు ఉండాలి అనుకున్నాను. నా గుర్తింపును పాడుచేయాల‌ని ఆశిష్ ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌లేదు. ఆయ‌న‌కు భవిష్య‌త్తుపై ఉన్న ఆలోచ‌నా విధానానికి నా ఆలోచ‌న తీరుకు భిన్నంగా ఉంది. అందుకే విడిపోవాల‌నుకున్నాం” అని తెలిపారు.