Anushka Shetty: సన్నబడిన స్వీటీ.. స్లిమ్ లుక్‌ పిక్ వైరల్

Anushka Shetty: సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే సినిమాలు చేసినా చేయకపోయినా.. అప్పుడప్పుడు మీడియాలో అయితే కనిపిస్తుంటారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. కానీ ‘బాహుబలి’ బ్యూటీ అనుష్క మాత్రం బయట దర్శనమిచ్చి చాలా ఏళ్ల గడిచిపోయింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత బయటకొచ్చింది. అయితే అందరూ ఈమెని చూసే షాకవుతున్నారు.

తెలుగు చిత్రసీమలో విజయవంతమైన నటీమణులలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒకరు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో వెలుగొందింది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అదే టైంలో ‘సైజ్ జీరో’ అనే సినిమా చేసింది. దీని కోసం నిజంగా బరువు పెరిగింది. అక్కడి నుంచి అనుష్కకు సమస్యలు మొదలయ్యాయి. పెరగడమైతే పెరిగిపోయింది గానీ దాన్ని తగ్గించడం కోసం నానా పాట్లు పడింది. అడపాదడపా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ కమర్షియల్ చిత్రాలకు పూర్తిగా దూరమైపోయింది.

అనుష్క శెట్టి చివరగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంట అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం అనుష్క మరో సినిమా చేయలేదు. అంతేకాదు అప్పటినుంచి ఒక్కసారి బయటకు కూడా రాలేదు. దాంతో అనుష్క ఏం చేస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. కనీసం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో స్వీటీ ఎలా ఉందనేది స్పష్టత లేకపోయింది. అయితే తాజాగా ఓ మలాయళ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొన్నారు.

ALSO READ: Deepika Padukone: దీపికా సరోగసీని ఎంచుకున్నారా..?

ఆ మధ్యలో బరువు కారణంగా అనుష్క పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందని.. దాని కారణంగానే సినిమాలకు దూరంగా ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా మీడియాకు దర్శనమిచ్చింది. తాజాగా అనుష్క శెట్టి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో తను నటించిన కొత్త చిత్రం యూనిట్ తో ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చింది. (Anushka Shetty)

రోజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’. ఈ మలయాళ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. కథనార్ సినిమా షూటింగ్‌లో అనుష్క శెట్టి పాల్గొన్నారు. అనుష్క చిత్ర బృందంతో కలిసి ఉన్న ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఇందులో అనుష్క స్లిమ్ లుక్‌లో ఉన్నారు. ఆమె చాలా సన్నబడ్డారు. అనుష్క లేటెస్ట్ ఫొటోస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనుష్కఇన్నాళ్లు వర్కౌట్స్ చేసిందని ఇట్టే అర్ధమవుతోంది.

ఈ ఫోటోలో అనుష్క అందంగా, నిర్మలంగా కనిపిస్తోంది. ఆమె నిండు వైభవంగా, ఆనందంగా, నవ్వుతూ కనిపించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆమె ఆరోగ్యంగా ఉందని తేలిపోయింది. చాలా కాలం తర్వాత తమ అభిమాన నటిని చూడడంతో ఆమె అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ముందే కథనార్ చిత్రం చేయడానికి అనుష్క శెట్టి ఒప్పుకున్నారు. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది. కథనార్ చిత్రంలో అనుష్క నెగిటివ్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాహుల్ సుబ్రమణియన్ సంగీత దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేయనుందని సమాచారం. క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క నటించిన విషయం తెలిసిందే.