Adipurush: తెరపైకి మరో వివాదం !

Mumbai: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas)​ నటిస్తున్న మోస్ట్​ అవెయిటెడ్​ మూవీ ఆదిపురుష్(Adipurush)​. రామాయణం(Ramayanam) ఆధారంగా ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్(Om Raut)​ రూపొందిస్తున్న ఈ సినిమా జూన్​ 16న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతి సనన్(Kriti Sanon)​ సీతగా, సైఫ్​ అలీఖాన్(Saif alikhan)​ రావణుడిగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆరంభం నుంచే వరుస వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ సినిమా నుంచి రిలీజ్​ చేసిన పోస్టర్లు, టీజర్​ వివాదాల బారిన పడ్డాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్​ కూడా వివాదంలో చిక్కుకుంది.

ఆదిపురుష్​ ట్రైలర్​ అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్​తో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాపై సెన్సార్ బోర్డ్ మెంబరే మేకర్స్ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు మెట్లక్కడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేసింది. బాలీవుడ్‌లో ఇదే బిగ్ టాపిక్‌ గా మారింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ కాకముందే మేకర్స్ ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టిన ఈయన బాంబే హైకోర్ట్‌ న్యాయవాదులైన ఆవిష్ రాయ్‌, పంకజ్‌ మిశ్రాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా విషయంలో ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే, వివాదాలు, విమర్శలు రాకుండా ఉండాలంటే, సెన్సార్​ బోర్డ్ సర్టిఫికేషన్ తర్వాతే ఈ మూవీని స్క్రీనింగ్ చేసేలా మేకర్స్ ను ఆదేశించాలని సంజయ్‌ తన పిటిషన్లో కోరారు. మరి ఈ పిటిషన్​పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.