Bichagadu 2: AMBలో సెకండ్ హాఫ్ మాత్ర‌మే వేసిన సిబ్బంది: ఆడియ‌న్స్ ర‌చ్చ‌

Hyderabad: గ‌చ్చిబౌలిలోని ఏఎంబీ(amb) మాల్‌లో ర‌చ్చ జ‌రిగింది. అక్క‌డ విజ‌య్ ఆంటోనీ(vijay antony) న‌టించిన బిచ్చ‌గాడు-2(bichagadu 2) సినిమా ప్లే అవుతోంది. అయితే నిన్న వీకెండ్ కావ‌డంతో చాలా మంది సినిమా చూసేందుకు ఏఎంబీకి వెళ్లారు. అయితే పొర‌పాటుగా థియేట‌ర్ సిబ్బంది సినిమాను సెకండ్ హాఫ్ నుంచి ప్లే చేసార‌ట‌. గంట‌కే సినిమా అయిపోయి క్రెడిట్స్ ప‌డుతుంటే ఆడియ‌న్స్ షాకయ్యారు. ఇంత డ‌బ్బు పెట్టుకుని వ‌స్తే ఇలా స‌గం సినిమానే చూపించి పంపేసారంటూ థియేట‌ర్‌లోనే ర‌చ్చ చేసారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి(mahesh babu) చెందిన ఈ మాల్‌లో ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గడం ఇదే మొద‌టిసారి. ఇలాంటి మాల్స్‌లో కూడా త‌ప్పులు జ‌రుగుతున్నాయంటూ ఆడియ‌న్స్ మండిప‌డుతున్నారు.