Prabhas ‘ఆదిపురుష్​’తో ప్రారంభం కానున్న అల్లు అర్జున్​ మల్టీప్లెక్స్​!

Hyderabad: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​(Allu Arjun) మల్టీప్లెక్స్​ బిజినెస్​లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సత్యం ఏషియన్​ మాల్​ని కొనుగోలు చేసిన బన్నీ దాన్ని మల్టీప్లెక్స్​గా తీర్చిదిద్దుతున్నారు. కాగా, అన్ని హంగులతో సిద్ధమైన ఈ థియేటర్​ పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas)​ నటిస్తున్న ఆదిపురుష్(Adipurush)​ సినిమాతో ఓపెనింగ్​ కానుందని తెలుస్తోంది. బాలీవుడ్(Bollywood)​ డైరెక్టర్​ ఓం రౌత్(Om Raut)​ రామాయణం ఆధారంగా రూపొందించిన సినిమా ఆదిపురుష్​. ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతి సనన్​ సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్​ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​, జై శ్రీరామ్​, రామ్​ సీతా రామ్​ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

కాగా బన్నీ ప్రస్తుతం పుష్ప 2(Pushpa2) షూటింగ్​తో బిజీగా ఉన్నారు. సుకుమార్​ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక, ఈ సినిమా తర్వాత సందీప్​ రెడ్డి వంగాతో సినిమా ప్రకటించారు అల్లు అర్జున్.