Allu Arjun: నా మ‌న‌సులో మాట చెప్పారు.. థ్యాంక్స్ రాజ‌మౌళి గారు

Allu Arjun says ramoji rao must be conferred with bharat ratna

Allu Arjun: ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీ రావుకు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించి ఆయ‌న‌కు త‌గిన గౌర‌వం ఇవ్వాల‌ని అన్నారు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. రామోజీ రావు పార్థివ‌దేహానికి నివాళులు అర్పిస్తూ ఆయ‌న క‌న్నీరుపెట్టుకున్నారు. రామోజీ రావుకు భార‌త ర‌త్న ఇవ్వ‌డ‌మే మ‌నం అందించే గొప్ప నివాళి అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. నేను కూడా అదే అనుకుంటున్నాను స‌ర్. నా మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టినందుకు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేసారు.