చిరు ఇంట సంబ‌రాలు.. ఎక్క‌డా క‌నిపించ‌ని అల్లు అర్జున్

allu arjun is now where seen at chiranjeevi house for celebrations

Allu Arjun: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అన్న‌య్య చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ కుటుంబీకులంతా క‌లిసి ప‌వ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప‌వ‌న్ వ‌దిన‌.. చిరు స‌తీమ‌ణి సురేఖ చేత కేక్ క‌ట్ చేయించారు. అయితే ఈ వేడుక‌ల్లో దాదాపు మెగా ఫ్యామిలీలోని వారంతా పాల్గొన్నారు కానీ.. అల్లు అర్జున్ మాత్రం క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నార‌ని తెలిసి అల్లు అర్జున్ ఆయ‌న‌కు జ‌స్ట్ ట్విట‌ర్ ద్వారా మ‌ద్ద‌తు తెలిపారు. కానీ త‌న స్నేహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి కోసం మాత్రం నంద్యాల వెళ్లి మ‌రీ ప్ర‌చారంలో పాల్గొన్నారు. అది జ‌న‌సేన నేత‌లను, మెగా కుటుంబీకుల‌ను ఎంతో బాధించింది. వారు బ‌య‌టికి చెప్ప‌లేదు కానీ.. జ‌న‌సేన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నాగ‌బాబు మాత్రం త‌న బాధ‌ను ట్వీట్ రూపంలో వెళ‌గ‌క్కేసారు.

మావాడు అయినా మాకు మ‌ద్ద‌తు తెలప‌ని వాడు ప‌రాయివాడు.. మావాడు కాక‌పోయినా మాకు మ‌ద్ద‌తు తెలిపేవాడు మా వాడు అని ట్వీట్ చేసారు. ఆ త‌ర్వాత విప‌రీత‌మైన ట్రోలింగ్ రావ‌డంతో ఆ ట్వీట్ డిలీట్ చేసిన‌ట్లు కూడా తెలిపారు. అందుకే ముఖం చెల్ల‌క అల్లు అర్జున్ సెల‌బ్రేష‌న్స్‌లో క‌నిపించ‌లేద‌ని తెలుస్తోంది.