Aishwarya Rajesh: ఆ ప్రశ్న హీరోలనూ అడగండి!

Hydewrabad: తెలుగు అమ్మాయే అయినా కోలీవుడ్​(Kollywood)లో రాణిస్తున్న హీరోయిన్​ ఐశ్వర్యా రాజేష్‌(Aishwarya Rajesh). కౌసల్య కృష్ణమూర్తి(Kousalya Krishnamurthy) సినిమాతో తెలుగులో ఓ మెరుపు మెరిసినా, మిగతా సినిమాలతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు సినిమాలు అంత కలిసి రాకపోవడంతో తమిళానికే పరిమితమైంది.  తాజాగా ఐశ్వర్య నటించిన ‘ఫర్హానా'(Farhana) చిత్రం తమిళంతోపాటు హిందీ, తెలుగులో ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఐశ్వర్య రాజేష్‌ మీడియాతో ముచ్చటించింది.

టాలీవుడ్(Tollywood)​ నుంచి పలు అవకాశాలు వస్తున్నా స్టార్​ హీరోల్లో సినిమాల్లో మాత్రం అవకాశం రావడం లేదని, చిన్న చిన్న సినిమాల కథలు నచ్చక తెలుగులో నటిచండం లేదని చెప్పుకొచ్చింది ఐశ్వర్య. లేడీ ఓరియెంటెడ్​ సినిమాలే చేయడంపై జర్నలిస్ట్​ అడిగిన ప్రశ్నకు ‘మీరు హీరోగా మాత్రమే ఎందుకు చేస్తున్నారు? అంటూ ఇదే ప్రశ్న హీరోలను అడగగలరా?’ అంటూ ఘాటుగా స్పందించింది. తాను కావాలని హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే చేయాలని అనుకోలేదని, హీరోలతోనూ కలిసి సినిమాలు చేశాయని, అవి మున్ముందు రిలీజ్‌ అవుతాయని, అవి లేట్‌ కావడంతో అనుకోకుండా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలే వరుసగా విడుదలవుతున్నాయని, అందుకే అలాంటి ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది. ‘నామీద న‌మ్మ‌కంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు `ఫ‌ర్హానా` సినిమాను నాతో చేయ‌టం చాలా ల‌క్కీగా భావిస్తున్నా. ఇది నాకు చాలా స్పెషల్‌ ఫిల్మ్. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ మూడు భాష‌ల్లో రిలీజ్ కావడం అనేది చాలా అరుదైన విషయం’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.