Aditi Rao Hydari: సిద్ధార్థ్‌తో క‌లిసి ఫొటో.. అది జ‌ర‌గ‌ని ప‌ని

Hyderabad: బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైద‌రి (aditi rao hydari).. సిద్ధార్థ్ (Siddharth) ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ జంట‌గా మ‌హాస‌ముద్రం సినిమాలో న‌టించారు. ఈ సినిమా తర్వాత నుంచే ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ప్రేమ‌గా మారిన‌ట్లు టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది. అదీకాకుండా ఇద్ద‌రూ క‌లిసే పార్టీల‌కు ఈవెంట్ల‌కు వెళ్ల‌డం, సోష‌ల్ మీడియాలో క‌లిసే రీల్స్ చేస్తుండ‌డంతో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌మాట నిజ‌మేనేమో అన్న సందేహాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈరోజు మ‌ధ్యాహ్నం అదితి (aditi rao hydari), సిద్ధార్థ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించారు. దాంతో అక్క‌డి ఫొటోగ్రాఫ‌ర్లు వారి ఫొటోలు తీస్తుండ‌గా అదితి మాత్ర‌మే ఫొటోల‌కు పోజిచ్చారు. కానీ సిద్ధార్థ్ మాత్రం లోప‌లికి వెళ్లిపోయారు. దాంతో సిద్ధార్థ్‌తో క‌లిసి ఫొటోల‌ను పోజులివ్వ‌చ్చు క‌దా అని ఫొటోగ్రాఫ‌ర్లు అదితిని అడిగారు. ఇందుకు ఆమె బ‌దులిస్తూ.. అది జ‌ర‌గ‌ని ప‌ని అన్నారు.

ఇక‌పోతే సిద్ధార్థ్ న‌టించిన ట‌క్క‌ర్ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవ‌బోతోంది. ఈ సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా సిద్ధార్థ్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డి రిపోర్ట‌ర్లు కూడా రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి సిద్ధూని అడిగారు. ఇందుకు సిద్దార్థ్ కాస్త కోపంగా బ‌దులిచ్చారు.