Adah Sharma: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసంలో చేరిన న‌టి

Adah Sharma shifts into sushant singh rajput house

Adah Sharma: దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసంలో చేరారు న‌టి అదా శ‌ర్మ‌. ముంబైలోని బాంద్రాలో ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసం అమ్మ‌కానికి పెట్టారు. కానీ చాలా మంది భ‌య‌ప‌డి ఆ ఇంటిని ఎవ్వ‌రూ కొనుగోలు చేయ‌లేదు. అదా శ‌ర్మ మాత్ర‌మే దానిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే.. సుశాంత్ చ‌నిపోవ‌డం వ‌ల్ల ఆ ఇంటిని ఎవరూ కొనుగోలు చేయ‌కపోవ‌డంతో ధర త‌గ్గించార‌ని.. త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తోంద‌నే అదా శ‌ర్మ కొనుగోలు చేసార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. నిన్ననే ఆమె ఆ ఇంట్లో దిగారు. ఆ ఇంట్లోకి వెళ్ల‌గానే పాజిటివ్ వైబ్స్ వ‌చ్చాయ‌ని అన్నారు.

బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. 2020 జూన్ 14న త‌న నివాసంలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ నెల 14కి సుశాంత్ చ‌నిపోయి నాలుగేళ్లు కావొస్తోంది. ఇప్ప‌టికీ త‌న సోద‌రుడి విష‌యంలో పోలీసులు కానీ సీబీఐ కానీ ఎలాంటి న్యాయం చేయ‌లేద‌ని అత‌ని సోద‌రి శ్వేతా సింగ్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.