మోస‌పోయిన స్టార్ న‌టుడి భార్య‌.. రూ.58 ల‌క్ష‌లు టోక‌రా!

Mumbai: బాలీవుడ్ స్టార్ న‌టుడు జాకీ ష్రాఫ్ భార్య‌, టైగ‌ర్ ష్రాఫ్ (tiger shroff) త‌ల్లి అయేషా ష్రాఫ్‌ (ayesha shroff) మోస‌పోయారు. ఓ వ్య‌క్తి న‌మ్మించి ఆమె నుంచి ఏకంగా రూ.58 ల‌క్ష‌లు టోక‌రా పెట్టాడు. దాంతో ఆమె వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. టైగ‌ర్ ష్రాఫ్‌కి చెందిన MMA మ్యాట్రిక్స్ కిక్ బాక్సింగ్ సంస్థ‌లో అలెన్ ఫెర్నాండెజ్ అనే కిక్ బాక్స‌ర్‌ను అపాయింట్ చేసారు అయేషా. ఈ సంస్థ మిక్స్ మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తోంది. దీని బాధ్య‌త‌లు అన్నీ అయేషా ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. 2018లో అయేషా అలెన్‌ను సంస్థ డైరెక్ట‌ర్‌గా అపాయింట్ చేసారు. అత‌ను ఇండియాలో, ఇంట‌ర్నేష‌నల్ ప్ర‌దేశాల్లో టోర్నమెంట్లు నిర్వ‌హిస్తాన‌ని చెప్పి చాలా మంది ద‌గ్గ‌ర రూ.58 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫండ్స్ క‌లెక్ట్ చేసి త‌న అకౌంట్‌లో వేయించుకున్నాడట‌, ఆ త‌ర్వాత అత‌ను కనిపించ‌కుండాపోయాడు. దాంతో ఫండ్స్ ఇచ్చిన‌వారంతా అయేషాను ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.