Sarath Babu: న‌టుడు శ‌ర‌త్‌బాబు క‌న్నుమూత‌

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్‌బాబు(sarath babu) క‌న్నుమూసారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న(sarath babu) ఈరోజు కొద్దిసేప‌టి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న కొంత‌కాలంగా సెప్సిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. అంటే శ‌రీర‌మంతా విష‌పూరిత‌మైపోయి ప్ర‌ధాన అవ‌య‌వాల‌న్నీ ఫెయిల్ అవుతాయి. దాంతో చాలా రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్సలో ఉన్నారు. ఆయ‌న మృతితో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెలకొంది. శ‌ర‌త్ బాబు భౌతిక‌కాయాన్ని చెన్నై త‌ర‌లించేందుకు ఆయ‌న కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ‌ర‌త్‌బాబుది శ్రీకాకుళం. సినిమాల్లోకి రాక‌ముందు ఆయ‌న ఐపీఎస్ కావాల‌ని క‌ల‌లు క‌న్నారు. అనుకోకుండా సినిమాల వైపు వ‌చ్చారు. 1973లో వ‌చ్చిన రామ‌రాజ్యం సినిమాతో ఆయ‌న హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఆయ‌న 250కి పైగా సినిమాల్లో న‌టించారు. ఈటీవీలో వ‌చ్చే అంత‌రంగాలు సీరియ‌ల్‌తో ఆయ‌న గుర్తింపు వ‌చ్చింది. ఇక శ‌ర‌త్‌బాబు.. సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ‌ను వివాహం చేసుకున్నారు. కొంత‌కాలానికే విడిపోయారు. శ‌ర‌త్ బాబు న‌టించిన ఆఖ‌రి చిత్రం మ‌ళ్లీ పెళ్లి. ఇందులో ఆయ‌న సూప‌ర్‌స్టార్ కృష్ణ పాత్ర‌లో న‌టించిన‌ట్లు తెలుస్తోంది.