RC16: బ‌రిలోకి ఏ.ఆర్ రెహ‌మాన్.. ఫ్యాన్స్​కి పండగే!

ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో గ్లోబల్​ స్టార్​గా మారిపోయారు మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​. బాలీవుడ్​ నుంచే కాకుండా హాలీవుడ్​ నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్నారంటే చెర్రీ క్రేజ్​ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ప్రస్తుతం చెర్రీ కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. RC15గా తెరకెక్కిన ఈ సినిమాకి తాజాగా గేమ్​ ఛేంజర్​ టైటిల్​ ఖరారు చేశారు మేకర్స్​. ప్రస్తుతం చెర్రీ ఈ సినిమా రెగ్యులర్​ షూటింగ్​కి బ్రేక్​ ఇచ్చి హాలిడే వెకేషన్ ఎంజాయ్​ చేస్తున్నారు. ఇటీవలే దుబాయ్​లో ఘనంగా తన శ్రీమతి ఉపాసన సీమంతాన్ని సెలబ్రేట్​ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చెర్రీ మాల్దీవ్స్​లో ఉన్నారు. కాగా, ఈ ట్రిప్​ నుంచి రాగానే మళ్లీ షూటింగ్​లో భాగం కానున్నారు. అయితే ఈ సినిమా పూర్తవగానే చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో తన తదుపరి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్​.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సినిమా స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ గా పూర్తి అయ్యిపోయినట్లు ఇటీవలే దర్శకుడు బుచ్చిబాబు తెలియజేశాడు. కాగా ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారని తెలుస్తోంది. తన మ్యూజిక్​తో ఆస్కార్ అందుకున్న రెహమాన్ గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న చరణ్ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నాడు అంటే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే రెహమాన్ ని ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానం పలుకుతూ అధికారికంగా ప్రకటించనున్నారట. ఇక ఇదే నిజమైతే ఫ్యాన్స్​కి పండగే.

అంతేకాదు, ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ ని ఎంపిక చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్​30తో యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ సరసన టాలీవుడ్​ ఎంట్రీ ఖరారు చేసిన జాన్వీ చెర్రీతోనూ జతకడితే భాగుంటుందని భావిస్తున్నారు అభిమానులు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని త్వరగా పట్టాలు ఎక్కించి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్​. ఈ క్రమంలో త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసి అధికారికంగా లాంఛ్​ చేయనున్నారని తెలుస్తోంది.