TV Actors: వ‌రుస‌గా ముగ్గురు హిందీ న‌టులు మృతి

Mumbai: హిందీ బుల్లితెర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలో వ‌రుస‌గా ముగ్గురు టీవీ న‌టులు (tv actors) మృతిచెందారు. రెండు రోజుల క్రితం ప్ర‌ముఖ బుల్లితెర న‌టుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ (aditya singh rajput) చ‌నిపోయాడు. నిన్న అనుప‌మ (anupama) సీరియ‌ల్ న‌టుడు నితీష్ పాండే (nitesh pandey) గుండెపోటుతో మృతిచెందగా.. వైభ‌వి ఉపాధ్యాయ (vaibhavi upadhyay) అనే న‌టి యాక్సిడెంట్‌లో దుర్మ‌ర‌ణం చెందారు. ముంబైలోని అంధేరీలో నివాసం ఉంటున్న ఆదిత్య త‌న ఇంట్లోని వాష్‌రూమ్‌లో అప‌స్మార‌క స్థితిలో క‌నిపించారు. వెంట‌నే అత‌డి స్నేహితుడు వాచ్‌మెన్ సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆదిత్య మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధ్రువీకరించారు. డ్ర‌గ్స్‌ ఓవ‌ర్ డోస్ కార‌ణంగానే ఆదిత్య చనిపోయి ఉంటాడ‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అనుప‌మ సీరియ‌ల్‌తో మ‌రింత ఫేమ‌స్ అయిన నితీష్ పాండే.. మ‌హారాష్ట్ర‌లోని ఓ హోట‌ల్‌లో శ‌వ‌మై క‌నిపించారు. ఇగ‌త్‌పురిలో షూటింగ్ కోస‌మ‌ని ఆయ‌న వెళ్లారు. ఈరోజు ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో కుప్ప‌కూలిపోయార‌ని ఆయ‌న అసిస్టెంట్ తెలిపారు. నితీష్ పాండే బాడీని పోస్ట్‌మార్టెంకు పంపించామ‌ని, ఆ త‌ర్వాతే వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఇక‌.. సారాభాయ్ వ‌ర్సెస్ సారాభాయ్ సీరియ‌ల్‌తో పాపులారిటీ సంపాదించుకున్న న‌టి వైభ‌వి ఉపాధ్యాయ్ నిన్న కారులో వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. కారు లోయ‌లో ప‌డిపోవ‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. ఇలా రెండు రోజుల వ్య‌వ‌ధిలో ముగ్గురు ఫేమ‌స్ టీవీ యాక్ట‌ర్లు చ‌నిపోవ‌డంతో బాలీవుడ్‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Aditya Singh Rajput

Nitesh Pandey

Vaibhavi Upadhyay