ప్రియురాలి ముందే కిరోసిన్ పోసుకున్న ప్రియుడు

ప్రేమించిన ప్రియురాలు తనను దూరం పెడుతుందని… ఇటీవల సరిగా తన మాట కూడా వినట్లేదని మనస్తాపానికి గురైన గుడివాడకు చెందిన ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆసుపత్రి పాలయ్యాడు. చివరికి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ పట్టణంలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని మార్వాడీ గుడి సమీపంలో నివాసం ఉండే బవర్ సింగ్ వన్‌ టౌన్‌ పోలీస్ స్టేషన్ ఎదుట టీ దుకాణం నిర్వహిస్తున్నారు. అతని రెండో కుమారుడు శైలేష్ సింగ్ (26) పట్టణానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. అతను ప్రేమించిన యువతి ఇటీవల ఓ ద్విచక్రవాహనం కొనుక్కొని చక్కర్లు కొట్టడం శైలేష్‌కు నచ్చలేదు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పినా వినకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో చెందిన అతను ఆదివారం సాయంత్రం తన ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లి ‘నువ్వు పదే పదే ద్విచక్రవాహనంపై తిరిగితే నేను చనిపోతానని’ యువతిని బెదిరించాడు. ‘నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని’ ఆమె బదిలివ్వడంతో మనస్తాపానికి గురైన శైలేష్ సింగ్ ప్రియురాలి ఇంటి పైన నివాసం ఉండే వారి ఇంటి వద్దకు వెళ్లి శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే అతడిని అంబులెన్స్‌లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. శైలేష్ సింగ్ పరిస్థితి విషమించంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ.. ఇవాళ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.