భార్యాభర్తలను ఢీకొన్న రైలు

శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నంబరు మూడు నుంచి భార్యాభర్తలు వేరే ట్రైన్ దిగి ఒకటో ప్లాట్ఫారం వైపునకు పట్టాలు దాటుతుండగా శంకర్‌పల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే వారు మృతి చెందారు. మృతులు వెనుక వచ్చే రైలు గుర్తించలేక చనిపోయినట్టు రైల్వే పోలీసుల ప్రాథమికంగా వెల్లడించారు. మృతి చెందిన భార్యాభర్తలు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగిలిన సమాచారం తెలియాల్సి ఉంది. రైల్వే సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.