Prabhas: ఏం రాసారు స‌ర్‌..!

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్(prabhas) రాముడి పాత్ర‌లో న‌టించిన ఆదిపురుష్(adipurush) ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాలోని జై శ్రీరామ్ ఫుల్ సాంగ్‌ను కూడా టీం రిలీజ్ చేసి హైప్ పెంచేసింది. అయితే ఇందులో మంగ‌ళ‌ప్ర‌థ‌మ‌ము అనే పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి రాసారట‌. టీజ‌ర్‌లో ఈ పాట వినిపిస్తుంది. ఈ పాట విన్నాక ప్ర‌భాస్ ఏం రాసారు స‌ర్‌.. అని రామ‌జోగయ్య‌ను తెగ మెచ్చుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ ఎంతో సంతోషించారు.

“వాయిస్ నోట్ ప్ర‌శంస‌. డైరెక్ట్ మ‌న డార్లింగ్ ప్ర‌భాస్ నుంచే వ‌చ్చింది ఏం రాసారు స‌ర్ అని. టీజ‌ర్ రిలీజ్‌కి ముందు ఆయ‌న నుంచి ప్ర‌శంస రావ‌డం నిజంగా గొప్ప విష‌యం. నేను కొత్త పాట గురించి మాట్లాడుతున్నాను. టీజ‌ర్‌లో మీరు విన్న మంగ‌ళ‌ప్ర‌థ‌ము పాట గురించి” అని రామ‌జోగయ్య ట్వీట్ చేసారు.