Suriya: అమెరికాలో చ‌నిపోయిన ఐశ్వ‌ర్య‌కి సూర్య నివాళి

Hyderabad: మే 6న అమెరికాలోని టెక్సాస్​లో జరిగిన కాల్పుల్లో ఐశ్వర్య తాటికొండ(Aishwarya Tatikonda) అనే తెలుగు అమ్మాయి చనిపోయిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య కోలీవుడ్​ స్టార్​ సూర్య(Suriya)కి పెద్ద అభిమాని. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఎమోషనల్ అయ్యారు. ఐశ్వర్య చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించి ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఓ లేఖను కూడా రాశారు.

‘మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. టెక్సాస్‌లో జరిగిన ఘటనలో మీ కుమార్తె కన్నుమూయడం దురదృష్టకరం. ఐశ్వర్య మరణం మనందరికీ తీరని లోటు. ఆమె మన జ్ఞాపకాల్లో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆకాశంలో ధ్రువతారలా వెలుగుతూనే ఉంటుంది’ అంటూ ఆ కుటుంబాన్ని ఓదార్చారు.

‘ఈ లేఖలో రాస్తున్న అక్షరాలు నీ మరణం గురించి కాదు. నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి నువ్వొక ధ్రువతారవి. చిరునవ్వు చిందిస్తూ, ప్రేమని పంచుతూ ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నావు. నువ్వు ఒక హీరో’ అని రాసుకొచ్చారు.  సూర్య, ఐశ్వర్యకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సూర్య తన 42 సినిమాగా తెరకెక్కుతున్న కంగువా (Kanguva) సినిమాలో నటిస్తున్నారు. సూర్య వారియర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్​ బ్యూటీ దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా నటిస్తోంది.