9 ఏళ్ల త‌ర్వాత న‌గ‌లు తిరిగిచ్చేసిన దొంగ‌..!

Odisha: న‌గలు దోచుకున్న ఓ దొంగ‌.. ఏకంగా 9 ఏళ్ల త‌ర్వాత వాటిని తిరిగిచ్చేసాడు(viral news). ఈ ఘ‌ట‌న ఒడిశాలో(odisha) చోటుచేసుకుంది. గోపీనాథ్‌పూర్‌లో ఉన్న గోపీనాథుడి(gopinath temple) ఆల‌యంలో 2014లో దోపిడీ జ‌రిగింది. స్వామివారి న‌గ‌లు అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యాయి. ఆల‌య అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా దొంగ ఎవ‌ర‌నేది తేల‌లేదు. ఇక ఆభ‌ర‌ణాలు దొర‌క‌వు అని తెలిసి అధికారులే కొత్త‌వి కొన్నారు. వాటితోనే స్వామివారికి కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి ఆల‌యం ద‌గ్గ‌ర పూజారికి ఓ బ్యాగు దొరికింది. తెరిచి చూస్తే 9 ఏళ్ల క్రితం పోయిన స్వామివారి న‌గ‌లు అని గుర్తించారు. దాంతో వెంట‌నే అధికారులకు స‌మాచారం అందించారు. ఆ బ్యాగులో ఓ ఉత్త‌రం కూడా దొరికింది. “తొమ్మిదేళ్ల క్రితం స్వామివారి ఆభ‌ర‌ణాలు దొంగిలించింది నేనే. అవి నా ద‌గ్గర ఉన్న‌ప్ప‌టి నుంచి జీవితంలో అన్నీ క‌ష్టాలే. నేను చేసిన త‌ప్పు తెలుసుకున్నాను. వాటిని తిరిగిచ్చేస్తున్నాను. క్ష‌మించండి” అని రాసి ఉంది. పైగా ఆ లెట‌ర్‌ను ఇంగ్లీష్ రాయ‌డం కొస‌మెరుపు. ఏదేమైనా స్వామివారి ఆభ‌ర‌ణాలు ల‌భించ‌డంతో గోపీనాథ్‌పుర ప్ర‌జ‌లు ఎంతో సంతోషించారు.