పెళ్లి వేడుక‌లో గొడ‌వ‌.. విషం తాగిన వ‌ధూవ‌రులు!

Madhya pradesh: ప్రేమ పెళ్లి(love marriage) చేసుకుని.. ఏదో చిన్న గొడ‌వ జ‌రిగింద‌ని అక్క‌డిక‌క్క‌డే విషం(poison) తాగేసారు వ‌ధూవ‌రులు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో(madhya pradesh) చోటుచేసుకుంది. క‌నాడియా ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి ఒక‌ర్నొక‌రు ప్రేమించుకున్నారు. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరేమోన‌ని స్థానిక ఆర్య స‌మాజ్‌లో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అయితే పెళ్లి తంతు జ‌రుగుతుండ‌గా.. వధూవ‌రుల మ‌ధ్య ఏదో గొడ‌వ జ‌రిగింది. దాంతో కోపంతో వ‌రుడు విషం తాగేసాడు. ఈ విష‌యాన్ని వ‌ధువుకు చెప్పాడు. దాంతో ఆమె కూడా విషం తాగింది. అప్ప‌టికే వ‌రుడు క‌ళ్లుతిరిగి ప‌డిపోయాడు. ఇద్ద‌రినీ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తుండ‌గా వ‌రుడు దారిలో చ‌నిపోయాడు. వ‌ధువుకు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీస్ తెలిపారు.