ఫిలిం స్టూడియోలో యంగ్​ టైగర్​ పెట్టుబడులు!

Hyderabad: RRR మూవీ తో గ్లోబల్ స్టార్​గా మారిన యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr NTR)​ ప్రస్తుతం NTR30 షూటింగ్​తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ(Koratala Siva) డైరెక్ట్​ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్​ కానుంది. ఇక ఈ చిత్రం లో జాన్వీ కపూర్(Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(saif ali Khan) విలన్ గా నటిస్తున్నారు.

కాగా, తాజాగా తారక్​ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు ఎటువంటి వ్యాపారాల్లో అడుగుపెట్టని ఎన్టీఆర్​ హైదరాబాద్​లోని ఓ ఫిలిం స్టూడియో(Film Studio)లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కెరీర్​ ఆరంభం నుంచి పలు సినిమాలతో పాటు బుల్లితెర మీద హోస్ట్ గానూ ప్రేక్షకులను అలరించారు ఎన్టీఆర్​. అయితే టాలీవుడ్​ హీరోలైన అల్లు అర్జున్(Allu Arjun) , రామ్ చరణ్(Ram Charan) మరియు మహేష్ బాబు(Mahesh Babu) కి ఉన్నట్టుగా బయట వ్యాపారాలు ఎన్టీఆర్ కి లేవు.

ఎన్టీఆర్​ వ్యాపార రంగం లో కూడా చక్రం తిప్పేందుకు సిద్ధం అయ్యారు. ఇండస్ట్రీ కి సంబంధించిన వివేక్ కూచి బోట్ల, నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరియు తాహిర్ తో కలిసి ఎన్టీఆర్ త్వరలోనే ఒక ఫిల్మ్ స్టూడియో లో పెట్టుబడులు పెట్టబోతున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఈ స్టూడియో కి సంబంధించి 5 అంతస్తుల భవనం ని కూడా నిర్మించాడట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ స్టూడియో లోనేNTR30 లేటెస్ట్ షెడ్యూల్ షూట్​ చేయనున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే తారక్​ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే!