Aishwarya Rajesh: శ్రీవ‌ల్లిగా ర‌ష్మిక కంటే నేనే బాగా చేసేదాన్ని

Hyderabad: శ్రీవ‌ల్లిగా ర‌ష్మిక మంద‌న(rashmika mandanna) కంటే నేనే బాగా చేసేదాన్ని అని అంటున్నారు ఐశ్వ‌ర్య రాజేష్‌(aishwarya rajesh). మ‌న తెలుగు అమ్మాయే అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్‌లో అవ‌కాశాలు అందుకోలేక‌పోతున్నారు. దాంతో త‌మిళంలో ఆమె వ‌రుస‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఆమె న‌టించిన సొప్ప‌న సుంద‌రి సినిమా త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయింది. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌తో ఆడియ‌న్స్‌ను మెప్పించింది. ఇప్పుడు ఫ‌ర్హానా అనే త‌మిళ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను చెప్పింది. “నేను తెలుగు అమ్మాయినే అయినా.. త‌మిళ‌నాడులో పెరిగాను. అందుకే అక్క‌డ బాగా ఛాన్సెస్ వ‌స్తున్నాయి. ఇక తెలుగులో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమా ఫ్లాప్ త‌ర్వాత మంచి క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని అనుకుంటున్నా. అలాంటి సినిమా ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా చేస్తా. నాకు పుష్పలో శ్రీవ‌ల్లి క్యారెక్ట‌ర్ వ‌చ్చి ఉంటే ఎగిరిగంతేసేదాన్ని. శ్రీవ‌ల్లిగా ర‌ష్మిక కంటే నేనే బాగా న‌టించేదాన్ని. మా అమ్మ చాలా సార్లు అనేది ఎందుకు నువ్వు తెలుగు అమ్మాయివి అయివుండి త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్నావు అని. దానికి ఆన్స‌ర్ నా దగ్గ‌ర కూడా లేదు. నాకు తెలుగులో ఎందుకు అవ‌కాశాలు రావ‌డంలేదో తెలీట్లేదు” అని తెలిపారు ఐశ్వర్య‌.