Vijayawada: ఎండ వేడికి ద‌గ్ధ‌మైన సెల్ ట‌వ‌ర్

Vijayawada: విజయవాడ(vijayawada) నగరంలోని కృష్ణలంక బాలాజీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భానుడి ప్రతాపంతో సెల్ టవర్ దగ్ధమైంది. IDFCఫస్ట్ బ్యాంకు బిల్డింగ్‌పై అధికారులు సెల్ టవర్లను ఏర్పాటు చేశారు. అయితే ఎండ వేడిమికి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సెల్ టవర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వైర్లు, బ్యాటరీలు, ఇతర పరికరాలు పూర్తిగా తగలపడిపోయాయి. సమాచారం అందిన వెంటనే కృష్ణలంక పోలీసులు అక్కడకు చేరుకుని బిల్డింగ్ చుట్టుపక్కల వారిని బయటకి పంపించి వేశారు. హుటాహుటిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో సెల్ టవర్, కేబుళ్లు, బ్యాటరీలు దగ్ధం అయ్యాయన్నారు. ఎండ వేడిమి వల్లే షార్ట్ సర్క్యూట్ అయినట్లు భావిస్తున్నామని… ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానిక సీఐ దుర్గారావు వెల్లడించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో వడదెబ్బ తగిలి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందారు.