DK Shivakumar: సిద్ధారామ‌య్య‌ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసా

Bengaluru: క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య(siddaramaiah) కోసం ఎన్నోసార్లు త్యాగం చేసాన‌ని అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్(dk shivakumar). క‌ర్ణాటక ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యాన్ని ద‌క్కించుకున్న కాంగ్రెస్.. ఆ రాష్ట్రానికి ఎవ‌రిని సీఎం చేయాలా అన్న ఆలోచ‌న‌లో ప‌డింది. ఒక ప‌క్క సిద్ధ‌రామయ్య కుమారుడు య‌తీంద్ర త‌న తండ్రే సీఎం అవ్వాల‌ని ఆకాంక్షించ‌డం, మ‌రోప‌క్క శివ‌కుమారే సీఎం అవ్వాల‌ని ఫ్యాన్స్ పోస్ట‌ర్లు ఏర్పాటుచేయ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో మీడియా ముందు శివ‌కుమార్ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. తాను ఎన్నోసార్లు సిద్ధ‌రామ‌య్య కోసం త్యాగాలు చేసాన‌ని అన్నారు. “సీఎం ఎవ‌ర‌నేది కాంగ్రెస్ నిర్ణ‌యిస్తుంది. నేను ప‌ద‌వి కోసం దిల్లీ గ‌డ‌ప తొక్కాల్సిన ప‌నిలేదు. ఈరోజు నా బ‌ర్త్‌డే. కాంగ్రెస్ నాకు ఏం గిఫ్ట్ ఇస్తుందో చూడాలి. మ‌రో విష‌యం క్లారిటీగా చెప్పాల‌ని అనుకుంటున్నా. నాకు సిద్ధ‌రామ‌య్య‌కు మ‌ధ్య ఎలాంటి వైరం లేదు. మేం బాగానే ఉన్నాం. ఎన్నోసార్లు సిద్ధ‌రామ‌య్య కోసం త్యాగాలు చేసాను. సిద్ధ‌రామ‌య్య‌ను సీఎం చేసిన‌ప్పుడు కూడా నేను ఆయ‌న వెన్నంటే ఉన్నాను”అన్నారు శివ‌కుమార్. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూస్తే.. సిద్ధ‌రామ‌య్య‌ను సీఎం చేసినా పెద్ద‌గా ఫీలవ్వ‌ర‌నే తెలుస్తోంది. మ‌రి కాంగ్రెస్ ఏం నిర్ణ‌యించుకుందో త్వ‌ర‌లో తెలుస్తుంది.