Nara Lokesh: YS రాజశేఖర్ రెడ్డికి లోకేశ్ నివాళులు

AP: TDP జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌(nara lokesh).. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్(ys rajasekhar reddy) రెడ్డికి నివాళులు అర్పించారు. కొన్ని నెల‌లుగా యువ‌గ‌ళం(yuvagalam) పేరిట ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఈరోజు శ్రీశైలంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నల్లకాలువ గ్రామానికి సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం వద్ద ఆగారు. అక్కడ YSRకు నమస్కారం చేసి, నివాళులు అర్పించారు. టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఎన్ని రాజ‌కీయ గొడ‌వలు ఉన్నా చ‌నిపోయిన‌వారికి గౌర‌వం ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త అని లోకేష్ నిరూపించారంటూ ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ప్ర‌శంసిస్తున్నారు.