Prabhas: భద్రాద్రి రాముడికి 10 లక్షల విరాళం!

Hyderabad: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas)​ రామాయణం(Ramayanam) ఆధారంగా రూపొందుతున్న ఆదిపురుష్(Adipurush)​ సినిమాలో రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవువడ్ డైరెక్టర్​ ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా భద్రాచలం సీతారామాలయంకు ప్రభాస్ 10 లక్షల విరాళం పంపించారు. ప్రభాస్ తరపున ఆయన బంధువులు దంతులూరి సత్యనారాయణ రాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి.. పలువురు భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిని కలిసి పదిలక్షల చెక్ అందించారు అనంతరం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మంచి విజయం సాధించాలని పూజలు నిర్వహించారు. ఈవో రమాదేవి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తరపున అందిన ఈ 10 లక్షలను అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాలకు కేటాయిస్తాం’ అని తెలిపారు.