Parineeti Chopra: పొలిటిషియ‌న్‌ని పెళ్లి చేసుకోను అంటూనే…!

Mumbai: బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా(parineeti chopra) మొత్తానికి ఓ ఇంటివారు కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(aap) నేత రాఘ‌వ్ చ‌ద్దాతో(raghav chadha) ఆమె నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. దిల్లీలోని కొన్నాట్ ప్రాంతంలో అంగ‌రంగ వైభవంగా వీరి నిశ్చితార్థ వేడుక జ‌రిగింది. నిశ్చితార్థ ఫొటోలను రాఘ‌వ్ ట్విట‌ర్‌లో షేర్ చేసారు. నేను కోరుకున్న అమ్మాయి.. య‌స్ చెప్పింది అని ట్వీట్ చేసారు. ఈ వేడుక‌కు పరిణీతి సోద‌రి ప్రియాంక చోప్రా కూడా హాజ‌రయ్యారు. దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కూడా త‌న స‌తీమ‌ణితో క‌లిసి వెళ్లారు. ఈ నిశ్చితార్థ వేడుక‌కు పరిణీతి, రాఘ‌వ్.. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు వేసుకున్నారు.

మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం ప‌రిణీతి.. కాఫీ విత్ క‌ర‌ణ్ అనే పాపుల‌ర్ టాక్ షోలో పాల్గొన్నారు. అప్పుడు హోస్ట్ క‌ర‌ణ్ జోహార్ ప‌రిణీతి ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నారు అని అడిగారు. ఇందుకు ప‌రిణీతి ఆన్స‌ర్ ఇస్తూ.. ఎవ‌రైనా ఓకే కానీ రాజ‌కీయ నాయ‌కుడిని మాత్రం అస్స‌లు చేసుకోను అన్నారు. కానీ ఇప్పుడు ఆమె ఓ పొలిటిషియ‌న్‌కే భార్య కాబోతున్నారు.