PVT04: మరో సినిమాతో రానున్న మెగా మేనల్లుడు!

Hyderabad: మెగా కాంపౌండ్​ నుంచి హీరోగా​ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా ఉప్పెన(Uppena)తోనే మంచి హిట్​ కొట్టారు పంజా వైష్ణవ్​ తేజ్(Panja Vaishnav Tej). వైష్ణవ్​ కెరీర్​ మొదటి నుంచే​ భిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ఫ్రూవ్​ చేసుకుంటున్నారు. తాజాగా వైష్ణవ్​ తన నాలుగో సినిమాను ప్రారంభించేశారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్​ సరసన టాలీవుడ్​ సన్సేషన్​  శ్రీలీల(Sreeleela) కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో జోజు జార్జ్, అపర్ణా దాస్ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), మెగా చార్మింగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. PVT04 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్​ త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.