Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

Amaravathi: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan mohan Reddy) శుభవార్త చెప్పారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ఏ(HRA)ను 12 శాతం నుంచి 16% పెంచినట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల కేంద్రాలలో పని చేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది.