K Raghavendra Rao: సీతారామం 2 ప్లాన్​ చెయ్యండి!

Hyderabad: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన సినిమా సీతారామం(Sitaramam). హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్లాసిక్​ లవ్​ స్టోరీగా అందరినీ ఆకట్టుకుంది. ఇక, ఈ సినిమాలో నేషనల్​ క్రష్​ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒక కీలక పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ఓ సైనికుడికి, ఓ యువరాణికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈతరం ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ సినిమాకు సీక్వెల్​ వస్తే బాగుంటుందని అభిమానులతోపాటు సినీ ప్రముఖులూ కోరుకుంటున్నారు. తాజాగా ఈ విషయాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao)నేరుగా ఈ సినిమా నిర్మాతలనే కోరారు.
సీతారామం సినిమాను రూపొందించిన స్వప్న సినిమాస్(Swapna Cinemas)​ తాజాగా అన్ని మంచి శకునములే(Anni Manchi Sakunamule) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. సీతారామం 2(Sitaramam2) ప్లాన్ చేయండి అంటూ స్వప్న నిర్మాణ సంస్థను కోరారు.
సీతారామం సినిమాలో సీత ఒంటరిగా మిగిలిపోవడం తలుచుకుంటే తనకి ఇప్పటికి కన్నీళ్లు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. రామ్ చనిపోకుండా ఎక్కడో ఉన్నాడని, అది సీతకి తెలిసేలా సీతారామం 2 ప్లాన్ చేయమని సలహా ఇచ్చారు. మరి దర్శకేంద్రుడు అడిగినందుకైనా సీతారామం సీక్వెల్ ని ప్లాన్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.