రాజ‌స్థాన్‌లో కూలిన IAF MiG-21.. 2 మృతి

Rajasthan: రాజ‌స్థాన్‌లో(rajasthan) IAF MiG-21 ఫైట‌ర్ జెల్ కుప్పకూలింది. హ‌నుమాన్‌గ‌డ్ ప్రాంతంలో విమానం కూల‌డంతో ఇద్ద‌రు పౌరులు చ‌నిపోయారు. స‌హాయక చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. పైల‌ట్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. MiG21 చ‌క్క‌టి ఫైట‌ర్ జెట్ అని త‌మ‌కు బాగా సాయ‌ప‌డింద‌ని మేజ‌ర్ జ‌న‌ర‌ల్ బ‌క్షి తెలిపారు. MiG21 60 ఏళ్ల నాటిద‌ని, ఇక దానిని వాడ‌టం ఆపేస్తే మంచిద‌ని పేర్కొన్నారు.