America Shooting: మృతుల్లో తెలుగు యువ‌తి.. కాబోయే భ‌ర్త‌తో షాపింగ్‌కి వెళ్లి..

America: అమెరికాలోని(america) టెక్సాస్‌లో జ‌రిగిన కాల్పున ఘ‌ట‌న‌లో తెలుగు యువ‌తి మ‌ర‌ణించింది. శ‌నివారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో అలెన్ మాల్‌లో(allen mall) దుండ‌గుడు ఒక్క‌సారిగా కాల్పుల‌కు(mass shooting) పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. మృతుల్లో తెలంగాణ‌కు(telangana) చెందిన ఐశ్వ‌ర్య తాటికొండ( thatikonda aishwarya) అనే యువ‌తి కూడా ఉంది. త‌న భ‌ర్త‌తో క‌లిసి షాపింగ్‌కు వెళ్లిన స‌మ‌యంలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐశ్వ‌ర్యకు కాబోయే భ‌ర్త‌కు మూడు బులెట్లు తగిలాయి. వాటిని తొల‌గించామ‌ని అత‌ను కోలుకుంటున్నాడ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మృతురాలు ఐశ్వ‌ర్య రంగారెడ్డి జిల్లా కోర్టులో జ‌డ్జిగా ప‌నిచేస్తున్నార‌ని స‌మాచారం. క‌న్న‌బిడ్డ చ‌నిపోయింద‌ని తెలిసి త‌ల్లిదండ్రులు విల‌విల్లాడుతున్నారు. త‌మ బిడ్డ మృత‌దేహాన్ని వెంట‌నే స్వ‌స్థ‌లానికి పంపాలని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.