Heart Attack: క్రికెట్​ ఆడుతూ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ మృతి!

Rangareddy: ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart attack)కు గురవుతున్నారు. ముఖ్యంగా కరోనా(Corona) అనంతరం ఈ సమస్య అధికమైనట్లు తెలుస్తోంది. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు గుండె పోటుతో మరణిస్తున్నారు. యువకుల్లో గుండె సంబంధ సమస్యలతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది.

తాజాగా ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని మహేశ్వరానికి చెందిన మణికంఠ(Manikanta) క్రికెట్ ఆడుతుండగా గుండె పోటు రావడంతో  మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో చోటు చేసుకుంది. మణికంఠ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ మణికంఠ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో మణికంఠ క్రికెట్ ఆడారు. ఒకే ఓవర్ బాలింగ్ చేసి కార్ లోకి వెళ్లి మణికంఠ విశ్రాంతి తీసుకున్నారు. మణికంఠ గుండె పోటుతో కారులోనే తుది శ్వాస విడిచారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.