Nizamabad: సుపారీ ఇచ్చి భర్తను చంపించింది!

Nizamabad: మద్యానికి బానిసై హింసిస్తున్నాడని భర్తను భార్య హత్య చేయించిన ఘటన నిజామాబాద్​ జిల్లాలో జరిగింది. ఇందల్వాయి(Indalvai) పీఎస్ పరిధిలో ఏప్రిల్ 30న  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త మద్యానికి బానిసై తనను బాధిస్తున్నాడని భార్య రూ.2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి నాలుగు సెల్ ఫోన్స్, ఒక బైక్, పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

గోపాల్(Gopal Mandal) మండలం కాస్వా తండాకు చెందిన పరావత్ గోపాల్(50), పీరుబాయి భార్యాభర్తలు. పరావత్ గోపాల్ గతంలో దుబాయ్(Dubai) కి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గోపాల్ కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అయితే కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కూతురు హైదరాబాద్ లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

భర్త మద్యానికి బానిసై తనను హింసిస్తున్నాడని భార్య పీరుబాయి చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి తన భర్తను చంపేయాలని ప్లాన్ చేశారు. తన బంగారం అమ్మి మరీ వారికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది.