Naga chaitanya: ఆయన గురించి మాట్లాడి వేస్ట్

Hyderabad: అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ'(Custody). ఈ సినిమాను కోలీవుడ్(Kollywood)​ దర్శకుడు వెంకట్​ ప్రభు(Venkat Prabhu) రూపొందించారు. ఉప్పెన(Uppena) బ్యూటీ కృతిశెట్టి(Kriti Shetty) హీరోయిన్​గా నటించిన ఈ సినిమా మే 12న తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య సినిమా ప్రమోషన్స్​లో పాల్గొంటూ పలు విషయాలు పంచుకుంటున్నారు. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ పరశురామ్(Parasu Ram) పై షాకింగ్ కామెంట్స్ చేశారు చైతన్య. ఆ వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ పరశురామ్ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. నా టైమ్ ఆయన వేస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్’ అని కాస్త ఘాటుగా స్పందించారు చైతూ. అంతేకాదు ‘నేనుగానీ, అఖిల్​గానీ ఇప్పటికిప్పుడు ఈ డైరెక్టర్​తో సినిమా చెయ్యాలనుంది అని ఒక్క మాట చెబితే చాలు, వెంటనే సెట్​ చేస్తారు. ఏ డైరెక్టర్​ కావాలో చెప్పండి.. అడ్వాన్స్​ పంపిస్తాను అని చాలాసార్లు అడిగారు. మా కెరీర్​ విషయంలో నాన్న తప్పేం లేదు.. మేమే నాన్నపై డిపెండ్​ అవకుండా మా టాలెంట్​తో ఎదగాలని అనుకుంటున్నాం’ అంటూ నాగార్జున గురించి చెప్పుకొచ్చారు చై.

అయితే, చైతూ మాటల వెనుక చాలా అర్థం ఉందని తెలుస్తోంది. నిజానికి నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్​లో చాలా రోజుల కిందనే ఓ సినిమా రావాల్సింది. “నాగేశ్వ‌ర‌రావు” అనే టైటిల్ తో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ పరశురామ్​కి సూపర్​స్టార్​ మహేష్​ బాబు(Mahesh Babu) సినిమా ఆఫర్​ రావడంతో నాగచైతన్య సినిమా వదిలేశారు. తర్వాత కూడా నాగచైతన్యతో సినిమా చేస్తానని చెబుతూ దాటేస్తూ వచ్చారట పరశురామ్​. అందుకే అందరితో చాలా కూల్​గా ఉండే నాగచైతన్య ఆ డైరెక్టర్​పై అసహనంతో ఉన్నారనే టాక్​ నడుస్తోంది.