అందరం ఒక్కటే.. అంటూ కోట్​ షేర్​ చేసిన సామ్​!

Hyderabad: టాలీవుడ్​ స్వీట్​ కపుల్​గా పాపులర్​ అయిన నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) విడాకుల ప్రకటనతో అభిమానులకు షాక్​ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో 2017 అక్టోబర్ 7న వివాహం బంధంతో ఒక్కటైన ఈ జంట 2021లో తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వీరిద్దరు విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. సమంత కొన్ని సందర్భాల్లో విడాకులు, నాగచైతన్య గురించి పరోక్షంగా  గురించి స్పందించినప్పటికీ చైతూ మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. కాగా ఇటీవల కస్డడీ(Custody) సినిమా ప్రమోషన్లలో భాగంగా విడాకులపై చైతూ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

సమంతతో గడిపిన రోజుల్ని చాలా గౌరవిస్తానని.. ఆమె చాలా లవ్లీ పర్సన్ అని తన మాజీ భార్యపై ప్రశంసలు కురిపించాడు చై. అలాగే ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండాలని.. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ కామెంట్స్ చేశాడు. చైతూ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన ఇన్ స్టా పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

సోషల్​ మీడియా ద్వారా అన్ని విషయాలు పంచుకునే సామ్​ తాజాగా తన ఇన్ స్టాలో ‘మనమంతా ఒక్కటే.. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి ’ అంటూ ఓ కొటేషన్ ను షేర్ చేసింది. చై కామెంట్స్ అనంతరం సామ్ ఇలా పోస్ట్ చేయడంతో ఇప్పుడు వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నాగచైతన్య నటించిన కస్టడీ మే 12న విడుదల కానుంది. ఇటీవలే శాకుంతలం(Shaakunthalam) సినిమాతో డిజాస్టర్​ అందుకున్న సమంత సిటాడెల్(Citadel)​ వెబ్​సిరీస్​, ఖుషి(Kushi) సినిమాలతో బిజీగా ఉంది.