“చెత్త‌” గొడ‌వ‌.. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసారు!

Bhopal: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో(madhya pradesh) దారుణం చోటుచేసుకుంది. త‌మ స్థ‌లంలో చెత్త వేస్తున్నారంటూ ఏకంగా ఓ కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపేసారు. మోరెన ప్రాంతానికి చెందిన ధీర్ సింగ్ తోమ‌ర్, గజేంద్ర సింగ్ తోమ‌ర్ మ‌ధ్య 2013 భూమి విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఒక‌రి స్థ‌లంలో ఒక‌రు చెత్త వేసుకుంటూ తెగ కొట్టుకునేవారు. అప్ప‌టికే ధీర్ సింగ్ తోమ‌ర్ కుటుంబంలోని ఇద్ద‌రిని గ‌జేంద్ర సింగ్ దాడి చేసి చంపేసాడు. దాంతో గ‌జేంద్ర‌ సింగ్ త‌న మిగిలిన కుటుంబంతో ఊరు వ‌దిలి వెళ్లిపోయాడు. కొంత‌కాలం త‌ర్వాత గొడ‌వ స‌ర్దుమ‌ణిగి గ‌జేంద్ర సింగ్ మ‌ళ్లీ ఊరికి వ‌చ్చాడు. దాంతో ధీర్ సింగ్.. గజేంద్ర కుటుంబంపై క‌ర్ర‌ల‌తో దాడి చేసి తూటాలు పేల్చాడు. దాంతో గ‌జేంద్ర సింగ్‌తో పాటు అత‌ని కుటుంబంలోని ముగ్గురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు కుమారులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్దరు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో స్థానిక హాస్పిట‌ల్‌ల‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేసారు.