MS Dhoni: రీరిలీజ్​ ఎప్పుడో తెలుసా!

Hyderabad: ఇండియన్ క్రికెట్(Indian Cricket) చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన క్రికెటర్​ ఎం.ఎస్. ధోనీ(MS Dhoni). భారతీయులు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న వరల్డ్​ కప్​ని అందించి మన దేశ క్రికెట్​ణి మరో లెవల్ కి తీసుకెళ్లిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni). దేశ విదేశాల్లోనూ మహీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ధోనీ స్పెషల్​ హెలికాప్టర్​ షాట్​ క్రికెట్​లో ఓ సంచలనం. వరల్డ్​ బెస్ట్​ మ్యాచ్​ ఫినిషర్​గానూ ధోనీకి మంచి క్రేజ్​ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉంటూ మిస్టర్​ కూల్​గా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని తన ఆటతో, వ్యక్తిత్వంతో సంపాదించుకున్నాడు ధోని.

ధోని జీవితం ఆధారంగా రూపొందిన  MS ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ 2016 లో విడుదలై భారీ విజయం సాధించింది. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్రలో అందర్నీ మెప్పించాడు. దిశా పటాని(Disha Patani), కియారా అద్వానీ(Kiara Advani), భూమిక(Bhumika Chawla), అనుపమ్ ఖేర్(Anupam Kher).. ముఖ్య పాత్రలు పోషించారు. సుశాంత్ ధోని పాత్రలో అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించాడు. ధోని కూడా సుశాంత్ తన పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు అని మెచ్చుకున్నాడు. సుశాంత్ కెరీర్ లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

కొంతకాలంగా పలు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని బయోపిక్ ని కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు. ధోని బయోపిక్ ని తెలుగు, తమిళ్, హిందీలో మే 12న రీ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ధోని అభిమానులతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.