యాత్ర సీక్వెల్.. జగన్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్!

Hyderabad: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర(Yatra). ఈ సినిమాని దర్శకుడు మహి వి. రాఘవ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజశేఖర్​ రెడ్డిగా మలయాళ స్టార్​ హీరో మమ్ముట్టి(Mammootty) ప్రధాన పాత్ర పోషించారు. 2019లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తెరకెక్కుతున్న సమయంలోనే యాత్ర మూవీ సీక్వెల్ ఉంటుందని, ఈ సీక్వెల్ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా ఉంటుందని తెలిపారు చిత్ర దర్శకుడు మహి వి. రాఘవ్. ఇక అప్పటినుండి యాత్ర2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు వైయస్ ఫ్యామిలీ అభిమానులు.

తాజాగా ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు మహి వి. రాఘవ్.. ‘’యాత్ర 2′ తప్పకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ‘యాత్ర 2’ గురించి ఎక్కువగా మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? వంటి అంశాల గురించి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత మాట్లాడతాను. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను… ‘యాత్ర 2’లో నేను చెప్పాలి అనుకున్న కథ! తప్పకుండా చెప్పి తీరుతా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాఘవ్​.
ఇక ఈ సినిమాలో జగన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నారట. ‘స్కామ్ 1992’లో ప్రధాన పాత్ర చేసిన ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ప్రతీక్ లో జగన్ పోలికలు ఉన్నాయని.. ఆయనైతే ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ వచ్చే ఛాన్స్ ఉందని అలా ప్లాన్​ చేశారట మేకర్స్. ఇక ఈ సినిమా 2024 ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.